ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు నిన్న రాత్రి అక్కడి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసు క్రైం బ్రాంచ్ రంగంలోకి దిగి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.
ముంబైలోని సీఎస్టీ, దాదర్, బైకుల్లా రైల్వేస్టేషన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం వద్ద బాంబులు పెట్టినట్లు పోలీసులకు ఫోన్ కాల్ రావడంతో.. అక్కడికెళ్లి తనిఖీలు చేశారు. అనంతరం అది ఫేక్ కాల్ అని బాంబు స్క్వాడ్ అధికారులు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.