Road accident: ఒకే వైపు వెళ్తున్న రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్న ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రా నుంచి నోయిడాకు వెళ్తున్న బస్సులు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన 40 మందిలో 20 మందికి స్వల్ప గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. మిగతా 20 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.