న్యూఢిల్లీ: అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తు న్న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో ఈ నెల 3న ఇద్దరు వ్యక్తులు చలి మం టలు వేశారు. యూపీలోని అలీగఢ్ జిల్లా, బర్హాన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్ వద్ద గేట్మ్యాన్ ఈ రైలులో మంటలు, పొగలను గమనించి రైల్వే అధికారులను అప్రమత్తం చేశా రు.
చమ్రౌలా రైల్వే స్టేషన్లో ఈ రైలు ను ఆపి సీఆర్పీఎఫ్ సిబ్బంది అన్ని బోగీలను తనిఖీ చేశారు. జనరల్ బోగీ లో 16 మంది చలి మంట వేసి చలి కాచుకుంటున్నట్లు గమనించి, వీరందరినీ అరెస్ట్ చేశారు. వీరిలో చందన్ (23), దేవేంద్ర (23) ఇది తమ పనేనని ఒప్పుకోవడంతో కేసు నమోదు చేశారు. మిగిలిన వారిని హెచ్చరించి వదిలేశారు.