జబల్పూర్: భారత 73వ గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా గిరిజన సాంప్రదాయ నృత్యాలు చేస్తున్న జానపద కళాకారులపై కెమెరా డ్రోన్ పడింది ( Drone felldown ). ఈ ఘటనలో ఆ ఇద్దరు కళాకారులకు గాయాలయ్యాయి. దాంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకున్నది. ఇవాళ ఉదయం గణతంత్ర వేడుకల్లో భాగంగా జానపద కళాకారులు నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా డ్రోన్ కెమెరాలతో ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఇంతలో ఓ డ్రోన్లో సాంకేతిక లోపం తలెత్తి కళకారులపై పడింది.
ఈ ఘటనలో ఓ మహిలా కళాకారిణి, మరో పురుష కళాకారుడికి గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే ఆ ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వారికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు చిన్న గాయాలేనని, ప్రమాదమేమీ లేదని చెప్పారు.