ముంబై: ఐపీఎస్ ఆఫీసర్లమంటూ ఇద్దరు వ్యక్తులు ముంబై(Mumbai)లో ఓ బ్యాంకు ఉద్యోగిని మోసం చేశారు. అనుకూల స్థలంలో పోస్టింగ్ చేయిస్తామంటూ ఆ ఉద్యోగి స్నేహితుడి నుంచి కూడా 35 లక్షలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నకిలీ ఐపీఎస్లను అరెస్టు చేశారు. గణేశ్ శివాజీ చవాన్, మనోజ్ కుపిందర్ పవార్ అనే ఇద్దర్ని ఆ నగరానికి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ స్నేహితుడి ద్వారా ఆ ఇద్దరు నకిలీ ఐపీఎస్లు పరిచయం అయినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు.
కేంద్ర ప్రభుత్వ శాఖాల్లో తమకు ఉన్నత ఆఫీసర్లతో లింకులు ఉన్నాయని ఆ నకిలీ ఐపీఎస్లు చెప్పినట్లు ఫిర్యాదులో తెలిపారు. నిందితులు తమ వద్ద కోటి డిమాండ్ చేసినట్లు ఆ ఇద్దరు నకిలీలపై ఫిర్యాదు నమోదు అయ్యింది. బ్యాంకు ఉద్యోగికి అనుకూల పోస్టింగ్ చేసేందుకు ఇప్పటికు 35 లక్షలు వసూల్ చేశారు. నాలుగేండ్లుగా దీనిపై బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చినట్లు ఒక నకిలీ అపాయింట్మెంట్ లెటర్ను కూడా ఆ ఐపీఎస్లు అందజేశారని ఫిర్యాదులో వెల్లడించారు. డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరినప్పుడు, ఆ నకిలీలు బెదిరించడం ప్రారంభించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లమంటూ మోసాలకు పాల్పడుతున్న నకిలీ వ్యక్తులకు సంబంధించిన మరిన్ని ఫిర్యాదులను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.