చండీగఢ్: జైలులో రెండు గ్యాంగ్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో పలువురు ఖైదీలు, పోలీసులు గాయపడ్డారు. పంజాబ్లోని హోషియార్పూర్ సెంట్రల్ జైలులో ఈ సంఘటన జరిగింది. బుధవారం జైలులోని రెండు గ్యాంగ్స్టర్ గ్రూపుల మధ్య కోట్లాట జరిగింది. దీంతో పలువురు ఖైదీలు గాయపడ్డారు. ఘర్షణను నివారించేందుకు ప్రయత్నించిన పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అయితే ఎంత మంది గాయపడ్డారు అన్నది తెలియలేదు.
కాగా, హోషియార్పూర్ సెంట్రల్ జైలులో రెండు గ్యాంగ్ల మధ్య జరిగిన ఘర్షణపై పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ, ఎస్పీ ర్యాంకు అధికారులు హుటాహుటిన ఆ జైలుకు వెళ్లారు. జైలులో పరిస్థితిని పరిశీలించారు. ఘర్షణలో గాయపడిన ఖైదీలు, పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే జైలులో రెండు గ్యాంగ్స్టర్ గ్రూపుల మధ్య ఘర్షణకు దారి తీసిన కారణం ఏమిటన్నది తెలియలేదు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ జైలు వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు.