నోయిడా : ట్విట్టర్ ఇండియా చీఫ్ మనీష్ మహేశ్వరి ఇవాళ ఉత్తరప్రదేశ్ పోలీసుల ముందు ప్రత్యక్షంగా హాజరుకానున్నారు. ఇటీవల ఓ ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన కేసులో ట్విట్టర్కు యూపీ పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో పోలీసు స్టేషన్కు రావాలంటూ నోటీసులు పంపారు. కానీ తాను నేరుగా పోలీసు స్టేషన్కు రాలేనని, కావాలంటే వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరవుతానని ట్విట్టర్ ఇండియా చీఫ్ మహేశ్వరి పేర్కొన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు మరో సారి ట్విట్టర్కు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో ఇవాళ 11.30 నిమిషాలకు ఘజియాబాద్ పోలీసుల ముందు మనీష్ హాజరుకానున్నారు. అబ్దుల్ సమాద్ అనే వ్యక్తిని కొందరు కొట్టారు. జై శ్రీరామ్, వందేమాతం అని నినాదాలు చేయాలంటూ అతనిపై కొందరు దాడి చేశారు. ఆ కేసులో ట్విట్టర్ ఇండియాపై కేసు బుక్ చేశారు. ఆ ట్వీట్లను డిలీట్ చేయాలని ట్విట్టర్ను ఆదేశించినా వాళ్లు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్విట్టర్ చీఫ్కు సమన్లు జారీ చేశారు. ముస్లిం వ్యక్తిపై దాడి జరిగిన కేసులో మతపరమైన కోణం లేదని పోలీసులు తేల్చారు.