న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఒకే ట్వీట్లో ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఫైల్, మీమ్స్లను పోస్ట్ చేసేలా కొత్త ఫీచర్ను ట్విట్టర్ తీసుకొచ్చింది. ఇంతకుముందు వీటిని వేర్వేరుగా పోస్ట్ చేయాల్సి ఉండేది.
అయితే యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఈ కొత్త ఫీచర్ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సేవలు భారత్తోపాటు కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉన్నదని, త్వరలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని ట్విట్టర్ పేర్కొన్నది.