ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహార శైలిపై గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఓ సమావేశంలో సీఎం మమతా బెనర్జీ ఓ ఎస్పీతో మాట్లాడుతూ… ‘గవర్నర్ నుంచి మీకెప్పుడైనా ఫోన్ వచ్చిందా? మీ విధులకు ఎప్పుడైనా ఆటంకం కలిగించారా?’అని సీఎం మమత ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వ్యవహారం ముదిరింది. దీనిపై గవర్నర్ ధన్కర్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ఇది అత్యంత ఆందోళన కలిగించే పరిణామం. బహిరంగంగా, మీడియా ముందే సీఎం మమత ఓ ఎస్పీని అలా అడగడం సీరియస్ అంశమే. ఇది అత్యంత దురదృష్టకరమైన అంశం’ అంటూ గవర్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.