ముంబై: యువనటి తునిషా శర్మ మృతి కేసులో బెయిల్ కోసం ఆమె సహనటుడు షీజాన్ ఖాన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను ముంబైలో వసాయ్ కోర్టు తిరస్కరించింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితుడికి బెయిల్ ఇస్తే.. దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. అందుకే నిందితుడి బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్నది.
గత ఏడాది డిసెంబర్ 24న నటి తునిషా శర్మ షూటింగ్ స్పాట్లోని టాయిలెట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తునిషా సహనటుడు షీజాన్ ఖానే ఆమెను ఆత్మహత్యకు పురికొల్పాడన్న అనుమానంతో అరెస్ట్ చేశారు. అతన్ని ఇంటరాగేట్ చేయగా పోలీసులకు మరిన్ని వివరాలు తెలిశాయి.
షీజాన్ ఖాన్, తునిషా శర్మ ఇద్దరూ ప్రేమించుకున్నారని, అయితే డిసెంబర్ 15న షీజాన్ బ్రేకప్ చెప్పడంతో తునిషా తీవ్ర మనస్తాపాని గురైందని, ఆ మనస్తాపంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తేలింది. తునిషా కుటుంబసభ్యులు కూడా షీజాన్పై ఆరోపణలు చేశారు. అయితే, షీజాన్ మాత్రం శ్రద్దావాకర్ హత్య కేసులా మాది కూడా మారుతుందేమోనన్న భయంతోనే తాను తునిషాకు బ్రేకప్ చెప్పానని, ఇలా జరుగుతుందనుకోలేదని అన్నారు.