రాయ్పూర్: చదువుకోవడానికి ఇంటికి వచ్చిన చిన్నారులకు చాక్లెట్లు ఆశచూపి వేధింపులకు పాల్పడ్డాడో వృద్ధుడు. రోజురోజుకు అతని ఆగడాలు పెరిగిపోతుండటంతో తమ తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించిన ఘటన ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో చోటుచేసుకున్నది.
దుర్గ్ జిల్లాకు చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు తన ఇంట్లో ట్యూషన్ చెబుతున్నది. దీంతో చుట్టుపక్కల వారు తమ పిల్లలను ఆమె వద్దకు ట్యూషన్కు పంపిస్తున్నారు. అయితే ఆ టీచర్ ఇంట్లో పనులు చేసుకుంటుండగా.. ఆమె తండ్రి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. 11, 12 ఏండ్ల వయస్సున్న బాలికలకు చాక్లెట్లు ఇస్తూ వారిని వేధించసాగాడు. దీంతో మైనర్ బాలికలు ఈ విషయాన్ని వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అతని ఆగడాలు రోజురోజుకు పెరుగుతుండటం, మరింతమంది చిన్నారులను వేధిస్తుండటంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు ఆ వృద్ధుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతనిపై కేసు నమోదుచేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.