TTE | ఫరీదాబాద్, మార్చి 3: జనరల్ టికెట్తో ఏసీ కోచ్ ఎక్కిన ఒక మహిళపై రైల్వే టీటీఈ అమానుషంగా ప్రవర్తించాడు. నడుస్తున్న రైలు నుంచి ఆమెను బయటకు తోసేశాడు. షాక్కు గురి చేసే ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో చోటు చేసుకుంది.
ఫరీదాబాద్, ఎస్జీజేఎం నగర్కు చెందిన భావన.. ఝాన్సీలోని ఒక వివాహానికి వెళ్లేందుకు ఫరీదాబాద్లో ఆగిన జీలమ్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్ ఎక్కింది. దీనిపై టీటీఈ ఆగ్రహం వ్యక్తం చేయగా, ఫైన్ కడతానంటూ తెలిపింది. దీనికి నిరాకరించిన టీటీఈ కోపంతో ఆమె సామానును ప్లాట్ఫాంపైకి విసిరేసి, ఆమెను రైలులోంచి తోసేయడంతో రైలు, ప్లాట్ఫాం మధ్య చిక్కుకుని తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే టీటీఈ పరారయ్యాడు. హత్యాయత్నం కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు టీటీఈ కోసం గాలిస్తున్నారు.