భోపాల్: మధ్యప్రదేశ్లోని రేవాలో దశాబ్దాల క్రితం నిర్మించిన భోలేనాథ్ ఆలయాన్ని కూల్చేసేందుకు కొందరు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని కూల్చివేతను అడ్డుకున్నారు. సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ కార్యాలయం ముందు ఈ ఆలయం ఉంది. ఆలయ కూల్చివేత ప్రయత్నాల వెనుక కుట్ర ఉందని స్థానికులు ఆరోపించారు. బీజేపీ ఆఫీస్ ఉన్న కాంప్లెక్స్ ముందు సుందరీకరణ చేయడానికే ఆలయాన్ని కూలుస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.