అగర్తలా: త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేస్తున్న పిజూష్ కంటి బిశ్వాస్ ( Pijush Kanti Biswas ) తన పదవికి రాజీనామా చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన రాజకీయాల నుంచి వైదొలగి తన వృత్తిలోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే తాను పదవికి రాజీనామా చేశానని తెలిపారు. చాలా రోజుల తర్వాత తిరిగి తన వృత్తిలోకి ప్రవేశిస్తుండటం సంతోషంగా ఉన్నదని ఆయన చెప్పారు.
అయితే, పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతుండటం తనకు బాధగా ఉందని పిజూష్ కంటి బిశ్వాస్ పేర్కొన్నారు. ఇన్ని రోజులు పార్టీకి సేవ చేసే అవకాశం కల్పిచినందుకు ఆయన పార్టీ జాతీయాధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.