త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ తన పదవికి శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామాను త్రిపుర గవర్నర్ ఎస్.ఎన్. ఆర్యకు సమర్పించారు. మరో ఆరు నెలల్లో త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంతటి కీలక పరిస్థితుల్లో సీఎం విప్లవ్ దేవ్ను తప్పించి, బీజేపీ కొత్త రాజకీయ పరిణామానికి దారి తీసింది. అయితే.. శనివారం సాయంత్రమే బీజేపీ అధిష్ఠానం కొత్త సీఎంను ప్రకటించనుంది.
అయితే మరో వాదన కూడా ఉంది. డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జిష్ణుదేవ్ వర్మను ఆపద్ధర్మ సీఎంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ వార్తను బీజేపీ అధికారికంగా ధ్రువీకరించడం లేదు. మరోవైపు నూతన సీఎంగా ఎవర్ని ప్రకటించాలన్న సందిగ్ధంలో బీజేపీ పడిపోయింది. శనివారం సాయంత్రం బీజేపీ శాసనసభా పక్షం భేటీ కానుంది.
2018 లో విప్లవ్ దేవ్ త్రిపుర సీఎంగా ఎన్నికయ్యారు. ఆయన కార్య పద్ధతి ఇతర నేతలకు, కార్యకర్తలకు ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో బీజేపీలో ఓ రకమైన ఉక్కపోత, తిరుగుబాటు ధోరణి తయారైంది. అధిష్ఠానం కూడా విప్లవ్ దేవ్పై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ సమయంలో విప్లవ్ దేవ్ సీఎంగా కొనసాగితే ఇబ్బందలుకున్న బీజేపీ… సింపుల్గా ఆయన్ను పదవి నుంచి తప్పించింది.