Trinamool | తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ గవర్నర్ ధన్కర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా గవర్నర్ ప్రతిరోజూ తనకు మెసేజ్లు పంపుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలు చేయడం పూర్తిగా అనైతికమని ఆయన మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి మమతకు వ్యతిరేకంగా ప్రతిరోజూ నాకు గవర్నర్ ధన్కర్ మెసేజ్లు పంపిస్తున్నారు. ఇది పూర్తిగా అనైతికమైంది. నేను సభ్యత్వం తీసుకున్న పార్టీకి మమతా బెనర్జీ అధినేత. గవర్నర్ను వెనకుండి ఎవరో నడిపిస్తున్నారన్నది నా అనుమానం. అమిత్షా, సుబేందు అధికారితో సమావేశం తర్వాతే గవర్నర్ ఇలా చేస్తున్నారు’ అని ఎంపీ సౌగతా రాయ్ తీవ్రంగా ఆరోపించారు.