ఇండోర్, మే 3: ఇతగాడి పేరు సామ్రాట్ మౌర్య. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లా నాన్పూర్కు చెందిన వాడు. వయసు 42 ఏండ్లు. ఓ గిరిజన తెగకు చెందిన ఇతడు గత 15 ఏండ్లుగా ముగ్గురు అమ్మాయిలతో సహజీవనం చేస్తున్నాడు.
వారికి ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ ముగ్గురినీ మనోడు ఆరుగురు పిల్లల సమక్షంలో తాజాగా పెండ్లి చేసుకున్నాడు. ఆ ముగ్గురికీ 30 నుంచి 35 ఏండ్ల వయసు ఉంటుంది. ముగ్గురినీ ఒకేసారి పెండ్లి చేసుకోవడం తెగ వైరల్ అవుతున్నది.