న్యూఢిల్లీ : నోయిడాలో బుధవారం డ్రోన్ల సాయంతో బ్లడ్ బ్యాగులను రవాణా చేసి ఐసీఎంఆర్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాల నుంచి పది శాంపిళ్లను జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డ్రోన్ల ద్వారా పంపించారు.
తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకుంటూనే బ్లడ్ బ్యాగులు పాడవకుండా రవాణా చేశామని ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ బాహల్ తెలిపారు.