జమ్ము: ‘యాంటి-డ్రోన్ టెక్నాలజీ’ని అభివృద్ధి చేసి, పలు పరిశ్రమలకు బదిలీ చేశామని డీఆర్డీవో చీఫ్ జీ సతీశ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆ పరిశ్రమలకు భద్రతా దళాల నుంచి ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. డ్రోన్ దాడులను తిప్పికొట్టే అన్ని సామర్థ్యాలతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశామని వివరించారు. సాంబాలోని జమ్ము సెంట్రల్ యూనివర్సిటీలో కలాం సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ శంకుస్థాపనకు హాజరైన సందర్భంగా సతీశ్ రెడ్డి మాట్లాడారు.