న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీమ్ కింద ఎప్పుడు రిక్రూట్మెంట్ ప్రారంభం అవుతుందున్న విషయాన్ని ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ అగ్నివీరులకు ఈ ఏడాది డిసెంబర్లో శిక్షణ ప్రారంభం కానున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. శిక్షణ పొందిన సైనికులకు వచ్చే ఏడాది మధ్య నుంచి సర్వీసు ప్రారంభం అవుతుందన్నారు. త్వరలోనే రిక్రూట్మెంట్ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. తమ అధికారిక వెబ్సైట్లో మరొ రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్, ర్యాలీలకు సంబంధించిన వివరాలను తమ రిక్రూట్మెంట్ సంస్థలు వెల్లడిస్తాయన్నారు. మరోవైపు అగ్నిపథ్ స్కీమ్ కింద నియామకాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. బీహార్, తెలంగాణ, యూపీ రాష్ట్రాల్లో పలు రైళ్లకు ఆర్మీ విద్యార్థులు నిప్పుపెట్టారు.