లక్నో: పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు టోల్ గేట్ను ఢీకొట్టి దూసుకెళ్లాయి. దీంతో టోల్ బూత్ సిబ్బంది ఆ ట్రాక్టర్లను నిలువరించలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆగ్రా పరిధిలోని సైయన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న టోల్ ప్లాజా నుంచి 13 ఇసుక ట్రాక్టర్లు దూసుకెళ్లాయి. టోల్ ట్యాక్స్ చెల్లించకుండా గేట్ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయాయి. టోల్ గేట్ కూడా ధ్వంసమైంది. ఆ ట్రాక్టర్లను ఆపేందుకు టోల్ బూత్ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అక్కడున్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, యూపీలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ‘ఇదీ బీజేపీ, ఇసుక మాఫియా ‘డబుల్ ఇంజన్’ ఆధిపత్యం తీరు. బీజేపీ ప్రభుత్వ అడ్డంకులు కూడా వారిలాగానే ఉన్నాయి’ అని విమర్శించారు.
మరోవైపు పోలీసులు ఈ సంఘటనపై స్పందించారు. కేసు నమోదు చేసి పలువురు డ్రైవర్లను అరెస్ట్ చేశారు. నిందితులు రాజస్థాన్లోని ధోల్పూర్కు చెందిన వారని తెలిపారు. వారిని గుర్తించడంతోపాటు అరెస్ట్ కోసం అక్కడి పోలీసుల సహాయాన్ని కోరినట్లు చెప్పారు. నిందితులపై గ్యాంగ్స్టర్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని, వారి ఆస్తులను సీజ్ చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.
ये है भाजपा और रेत माफ़िया के डबल इंजन की दबंगई!
भाजपा सरकार के बैरियर भी उनकी ही तरह दिखावटी हैं। pic.twitter.com/38Gj9C1lf2
— Akhilesh Yadav (@yadavakhilesh) September 4, 2022