Satellite Toll System | దేశవ్యాప్తంగా మే ఒకటి నుంచి శాటిలైట్ టోల్ వసూలు చేయనున్నట్లు వచ్చినట్లు వార్తలపై కేంద్రం స్పందించింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ శుక్రవారం స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ఆధారిత టోల్ విధానం స్థానంలో శాటిలైట్ టోల్ విధానాన్ని అమలు చేయనున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం ఈ క్రమంలో కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) విధానాన్ని తొలుత ఎంపిక చేసిన టోల్ప్లాజాల వద్ద ఫిక్స్ చేస్తారు.
ఇందులో ఏఎన్పీఆర్తో పాటు ఫాస్టాగ్ని కలిపి సేవలందిస్తారు. అంటే ఏఎన్పీఆర్ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్లను గుర్తిస్తే.. వాహనాలను నిలపాల్సిన అవసరం లేకుండానే ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా టోల్ని వసూలు చేయనున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-నోటీసులు జారీ చేయనున్నారు. ఫాస్టాగ్ రద్దు, పెనాల్టీలు విధించనున్నారు. అయితే, ఎప్పటి నుంచి అమలు చేయనున్నారనే విషయంపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా.. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.