Congress : గోవా బీజేపీ పాత కాంగ్రెస్లాగా మారిపోయిందని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ దినేశ్ గుండూరావు విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వారందరూ బీజేపీలోనే ఉన్నారని, అదో పాత కాంగ్రెస్లాగే అయిపోయిందని ఎద్దేవా చేశారు. అవినీతి చేసే వాళ్లు మాత్రమే బీజేపీతో ఉన్నారన్నారు. గోవా మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాటలు ఒక్కసారి వింటే.. బీజేపీ ప్రభుత్వంలో ఎంత అవినీతి ఉందో ఇట్టే అర్థమైపోతుందన్నారు. బీజేపీ పాలనతో గోవా ప్రజలు విసుగెత్తిపోయారని పేర్కొన్నారు. గోవాకు కాంగ్రెస్ ప్రభుత్వం, గాంధీ కుటుంబం చేసిన సేవ కేంద్ర హోంమంత్రి అమిత్షాకు తెలియదని అన్నారు. రాజీవ్ గాంధీ గోవాకు రాష్ట్ర హోదా కల్పించారని, మహారాష్ట్రతో గోవా కలిసుండాలా? వద్దా? అని రిఫరెండం చేయాలని ఇందిరా గాంధీ నిర్ణయించారని, బీజేపీకి ఈ విషయాలు తెలియనవి గుండురావు ఎద్దేవా చేశారు.