ఖాండ్వా: రేపిస్టులను పబ్లిక్గా ఉరితీయాలని మధ్యప్రదేశ్ మంత్రి ఉషా థాకూర్ అన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులను ఉరి తీస్తే, ఇలాంటి నేరాలకు పాల్పడేందుకు ఇతరులు భయపడుతారని ఆమె అన్నారు. ఇటీవల ఖాండ్వా జిల్లాలో నాలుగేళ్ల అమ్మాయిని హత్యాచారం చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఇలాంటి కేసుల్ని డీల్ చేస్తోందని, రేపిస్టులకు మరణశిక్షణ విధించిన తొలి రాష్ట్రం మధ్యప్రదేశ అని మంత్రి అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 72 మందికి మరణశిక్షను విధించినట్లు ఆమె తెలిపారు.