కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అక్టోబర్ 30న జరగనున్న నాలుగు అసెంబ్లీ స్ధానాల ఉప ఎన్నికలకు ముందు కాషాయ పార్టీపై పాలక టీఎంసీ విమర్శలు గుప్పించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు రాష్ట్రానికి ఇచ్చిన హామీలేమయ్యాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ప్రశ్నించారు. సుందర్బన్స్ అభివృద్ధికి రూ రెండు లక్షల కోట్లు కేటాయిస్తామని అమిత్ షా ఇచ్చిన హామీకి అతిగతీ లేదని దుయ్యబట్టారు.
ఢిల్లీ పాలకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగాల్కు ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్ధులు జగన్నాధ్ సర్కార్, నిశిత్ ప్రమాణిక్లు ఎంపీలుగా కొనసాగేందుకు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారని చెప్పారు. వారి నిర్వాకంతో ఉప ఎన్నికలు రాగా బీజేపీ తిరిగి ఆయా స్ధానాల్లో ఓట్లను అభ్యర్ధిస్తోందని కాషాయ అభ్యర్ధులను ప్రజలు తిరస్కరిస్తారని బెనర్జీ పేర్కొన్నారు.