న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని థానేలో ఓ యోగా శిబిరంలో రాందేవ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మహిళలు చీరకట్టులో, సల్వార్ సూట్స్లో అందంగా ఉంటారని, వారు ఏం ధరించకపోయినా బాగుంటారని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి.
యోగా గురు వ్యాఖ్యలను టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర తీవ్రంగా ఖండించారు. 2011లో మహిళ వేషంలో రాందేవ్ బాబా రాంలీలా మైదానం నుంచి ఎందుకు పారిపోయారో ఇప్పుడు తనకు తెలిసిందని, ఆయన తనకు శారీలు, సల్వార్లు ఇష్టమని చెబుతున్నారని ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు.
महाराष्ट्र के उपमुख्यमंत्री जी की पत्नी के सामने स्वामी रामदेव द्वारा महिलाओं पर की गई टिप्पणी अमर्यादित और निंदनीय है। इस बयान से सभी महिलाएँ आहत हुई हैं, बाबा रामदेव जी को इस बयान पर देश से माफ़ी माँगनी चाहिए! pic.twitter.com/1jTvN1SnR7
— Swati Maliwal (@SwatiJaiHind) November 26, 2022
ఇక మహిళలపై రాందేవ్ బాబా అనుచిత వ్యాఖ్యలను ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ఖండించారు. యోగా గురు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య సమక్షంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఖండించతగినవని అన్నారు. యోగా గురు వ్యాఖ్యలు మహిళా లోకాన్ని బాధించిందని, ఆయన తప్పుడు వ్యాఖ్యలకు దేశ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు.