కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీని జేమ్స్బాండ్ 007తో పోలుస్తూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సోషల్మీడియాలో ఓ మీమ్ను షేర్ చేశారు. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్ను తలపించే పోస్టర్పై నరేంద్ర మోదీ ఫోటోను పోస్ట్ చేశారు.
నా హయాంలో డెవలప్మెంట్ జీరో, ఆర్ధిక వృద్ధి జీరో, ఏడేండ్ల ఆర్ధిక విధ్వంసం అంటూ మోదీని ఉద్దేశించి మీమ్లో ప్రస్తావించారు. ఆర్ధిక వ్యవస్ధను మోదీ ప్రభుత్వం అసమర్ధంగా నిర్వహిస్తోందని ఎంపీ ఒబ్రెయిన్ తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో ఆర్ధిక వ్యవస్ధను మోదీ సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు.