పనాజీ: గోవాలో తమ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. పనాజీ కార్యాలయం వద్ద బ్యానర్లు, ఫ్లెక్సీ బోర్డులను ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తొలగించి వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసులతో కూడిన ఒక టీమ్ తమ పార్టీ కార్యాలయానికి వచ్చి ఫ్లెక్సీలు, బ్యానర్లను ధ్వంసం చేస్తున్నారని ఒక లేఖ ద్వారా ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా మీడియాకు విడుదల చేసింది.
కాగా, మహారాష్ట్రవాదీ గోవాన్ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీఎంసీ, గోవా ఎన్నికల్లో ఇప్పటి వరకు 11 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్తో పొత్తు కోసం కూడా ప్రయత్నించింది. తాజాగా రెండో అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేసింది. ఫిబ్రవరి 14న గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
మరోవైపు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎంపీ అభిషేక్ బెనర్జీ, పార్టీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా, లుయిజిన్హో ఫలేరో, నఫీసా అలీ సోధీ, లియాండర్ పేస్, కీర్తి ఆజాద్ల నేతృత్వంలో గోవా అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఎంసీ విడుదల చేసింది.