న్యూఢిల్లీ: ఢిల్లీలోని సాకేత్ ఏరియాలో ఉన్న సెలెక్ట్ సిటీ వాక్ మాల్లో యాపిల్ రిటేల్ స్టోర్ను ఆ సంస్థ ఓనర్ టిమ్ కుక్(Tim Cook) ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే గురువారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఐపీఎల్లో జరిగిన మ్యాచ్ను టిమ్ వీక్షించారు. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ను ఆయన చూశారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజాలు కూడా ఆ మ్యాచ్ను తిలకించారు. స్టేడియంలోని స్టాండ్స్లో టిమ్తో కలిసి సోనమ్ కపూర్ ఫోటోలు కూడా దిగారు.
టిమ్ దిగిన ఫోటోలను ఆనంద్ షేర్ చేశారు. ఇండియాలో మీ వ్యాపారం వృద్ధి చెందాలని ఆశిస్తూ ఆయన కామెంట్ చేశారు. సోనమ్ కపూర్ కూడా కొన్ని పిక్స్ను పోస్టు చేసింది. లైనిన్ శారీలో.. వింటేజ్ జ్వెల్స్ ధరించిన సోనమ్ చాలా సింపుల్గా కనిపించారు. టిమ్, ఆనంద్తో కలిసి సోనమ్ సెల్ఫీ దిగింది. తన ఇన్స్టాలో సోనమ్ ఫోటోలను పోస్టు చేసింది. దేశంలో యాపిల్ వస్తువుల్ని అమ్ముతున్న తీరు పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసింది.