న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మంగళవారం 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. సీనియర్ నేత కమల్నాథ్ కొడుకు నకుల్నాథ్ మరోసారి మధ్యప్రదేశ్లోని చింద్వారా నుంచి, మరో సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ రాజస్థాన్లోని జలోర్ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం, డామన్ & డయ్యూలలోని 60 స్థానాల అభ్యర్థులపై సోమవారం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. కానీ 43 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించారు.