ప్రకృతి పిలిస్తే ఎవరైనా వెళ్లాల్సిందే. మల, మూత్రాలను ఆపుకోవడం ఎవరికైనా కష్టమే. కౌంటర్లో కూర్చొని టికెట్ ఇస్తున్న ఆపరేటర్కు సడెన్గా ప్రకృతినుంచి పిలుపొచ్చింది. అయితే, అతడు నిర్లక్ష్యంగా లేచి వెళ్లిపోలేదు. బాధ్యతాయుతంగా ఓ బోర్డు పెట్టి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
పాట్నాలోని రైల్వే స్టేషన్లో టికెట్ ఆపరేటర్కు అర్జెంట్గా బాత్రూం వెళ్లాల్సి వచ్చింది. ఓ సూచన బోర్డుపై ‘బాత్రూం నుంచి వస్తున్నా.. కాసేపు వేచిచూడండి..’ అని రాశాడు. ఈ సైన్బోర్డును వీడియో తీసి ‘ఏయ్ హిమాన్సూ’ అనే యూజర్ ట్విటర్లో పెట్టగా, వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ నోట్ను చూసిన వారందరూ నవ్వాపుకోలేకపోతున్నారు. ఈ వీడియో ఇప్పటివరకూ లక్షా 28వేల వ్యూస్ను సొంతం చేసుకున్నది. 700 కంటే ఎక్కువ మంది షేర్ చేశారు.
Patna Junction 😂😂🙏 pic.twitter.com/T8MOLR3APJ
— Aye Himanसू ® (@4mlvodka) August 30, 2022