అహ్మదాబాద్ : దేశంలో ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతున్నది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నది. యూకే నుంచి ఇటీవల గుజరాత్కు వచ్చిన ముగ్గురు వ్యక్తులకు ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు ఆదివారం గుర్తించారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య పదికి చేరింది. ఈ నెల 15న యూకే నుంచి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చిన ఎన్ఆర్ఐకి ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొవిడ్ పాజిటివ్గా తేలిందని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్గా తేలిందని చెప్పారు.
ప్రస్తుతం సదరు వ్యక్తిని అహ్మద్నగర్ సివిల్ ఆసుపత్రికి తరలించగా.. కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. అతని కాంటాక్టులను సైతం గుర్తించి, పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గాంధీనగర్కు చెందిన 15 సంవత్సరాల బాలుడు యూకే నుంచి బాలుడు సైతం కొత్త వేరియంట్ బారినపడ్డాడని, అతని కాంటాక్టులను గుర్తించి పరీక్షలు చేసినట్లు గాంధీనగర్ మున్సిపల్ కమిషనర్ ధవల్ పటేల్ పేర్కొన్నారు. యూకే నుంచి వచ్చిన మరో వ్యక్తికి సైతం ఒమిక్రాన్ పాజిటివ్గా గుర్తించారు. తాజా మూడు కేసులతో కలిపి గుజరాత్లో మొత్తం కేసుల సంఖ్య 10కి చేరగా.. దేశంలో కేసుల సంఖ్య 146కు పెరిగింది.