మానవత్వం రోజురోజుకి కనుమరుగవుతోందని చెప్పడానికి ఈ కరోనా పరిస్థితులే నిదర్శనం. కోవిడ్ వల్ల ప్రాణాలతో పోరాడుతున్న వారికి వీలైనంత సాయం చేయాల్సింది పోయి ఈ టైమ్ లోనూ డబ్బు డబ్బు అంటూ వెంపర్లాడుతున్నారు. అలా అతిగా ఆశపడిన ఈ ముగ్గురు చివరకు కటకటాల పాలయ్యారు.
కోవిడ్ ట్రీట్ మెంట్ లో కీలకమైన రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో ఇదే అదునుగా భావించి చాలామంది బ్లాక్ మార్కెట్లో ఒక్కో ఇంజక్షన్ని వేలల్లో అమ్ముతున్నారు. అలా బ్లాక్ మార్కెట్లో రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను అమ్ముతున్న ముగ్గురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చే శారు. థానే మిరా రోడ్డులో వీరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.2.25లక్షల విలువైన రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల స్టాక్ ని స్వాధీనం చేసుకున్నారు.