Ghaziabad | ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలోని ఓ సొసైటీ లిఫ్ట్లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ చిన్నారులు దాదాపు 20 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఘజియాబాద్లోని క్రాసింగ్స్ రిపబ్లిక్ టౌన్షిప్లో గల అసోటెక్ ది నెస్ట్లో నవంబర్ 29న ముగ్గురు చిన్నారులు లిఫ్ట్లో ఉండగా అది సడెన్గా ఆగిపోయింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేందుకు చిన్నారులు ప్రయత్నించినా ఓపెన్ కాలేదు. భయపడిన చిన్నారులు ఏడుస్తూ సాయం కోసం గట్టిగా అరిచారు. అందులోని ఓ చిన్నారి లిఫ్ట్ రోడ్ను తన రెండు చేతులతో తెరిచేందుకు ప్రయత్నించింది. అయినా అది ఓపెన్ కాపోవడంతో తీవ్ర భయాందోళనకు గురైంది. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఆ చిన్నారులు ప్రాణ భయంతో అందులోనే ఉండిపోయారు. అనంతరం చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీలో ఉన్న లిఫ్ట్లల్లో తరచూ ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయని చెప్పారు. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. లిఫ్ట్లు ఆగిపోయిన సమయంలో అందులో సీనియర్ సిటీజన్లు, చిన్నారులు ఉంటే వారి ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
#Ghaziabad क्रासिंग रिपब्लिक के assotech Nest society में बीती शाम 3 मासूम बच्चियां लिफ्ट में 25 मिनट तक फंसी रही, बेहद मुश्किलात के बाद उन्हें बाहर निकाल लिया गया,AOA के अध्यक्ष और सचिव के खिलाफ FIR दर्ज हुई है।यूपी की सोसाइटी में लिफ्ट एक्ट की जरूरत है @ghaziabadpolice @UPGovt pic.twitter.com/D0IsBChls9
— Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) December 1, 2022