శ్రీనగర్, మే 26: జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కరణ్ సెక్టార్ గుండా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో సైన్యం ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టింది. గురువారం ఉదయం ఉగ్రవాదులను గుర్తించగా ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల్లో ఒక సాధారణ పౌరుడు కూడా చనిపోయాడు. హతుల నుంచి ఆర్మీ భారీ స్థాయిలో ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకొన్నది.