చెన్నై: శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తల అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అందించే ఉన్నత పురస్కారం రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం)కు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు ఎంపికయ్యారు. ఈ అవార్డులను విజ్ఞాన్ రత్న (వీఆర్), విజ్ఞాన్ శ్రీ (వీఎస్), విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ (వీవై-ఎఎస్బీ), విజ్ఞాన్ టీమ్ (వీటీ) అనే నాలుగు క్యాటగిరీల్లో ఇస్తారు.
ఈ ఏడాది మద్రాస్ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్లు తలప్పిల్ ప్రదీప్కు వీఎస్, మహాశంకర్ శివప్రకాశంకు వీవై-ఎస్ఎస్బీ, శ్వేతా ప్రేమ్ అగర్వాల్కు కూడా వీవై-ఎస్ఎస్బీ అవార్డు లభించింది. ఈ అవార్డులపై ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.