లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మరణానికి రాష్ట్రం మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రకటించారు. రాజస్థాన్ మాజీ గవర్నర్, యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ శనివారం సాయంత్రం లక్నోలోని సంజయ్ గాంధీ దవాఖానలో మరణించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 23న ఆయన అంత్య క్రియలు నరోరాలో గంగానదీ తీరాన నిర్వహిస్తామని యోగి ఆదిత్యనాథ్.. ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు. అప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.