న్యూఢిల్లీ, డిసెంబర్ 18: భూతాపానికి కారణమైన గ్రీన్హౌస్ వాయువుల్లో ప్రధానమైనది కార్బన్ డయాక్సైడ్. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఈ వాయువు స్థాయులు ఏటా 1.3 పార్ట్స్ పర్ మిలియన్ పెరుగుతున్నాయి. గత 5వేల ఏండ్లలో 400 రెట్లు వేగంగా కార్బన్స్థాయిలు పెరిగిపోయాయి. పర్యావరణానికి అత్య ంత హానిచేస్తున్న ఈ వాయువు పెరుగుదలకు మనుషుల ఆహారపు అలవాట్లు 25 శాతం కారణమని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా మాంసాహారుల వల్ల ఈ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. జంతుప్రొటీన్లు, కొవ్వులు, చాకొలెట్స్, వెజిటెబుల్ ఆయిల్స్ లాం టి పదార్థాల వాడకం కార్బన్ ఫుట్ప్రింట్ పెరిగేందుకు కారణమవుతున్నట్టు గుర్తించారు. 1998-2018 మధ్య మంసాహార వినియోగం 58 శాతం పెరిగిందని కనుగొన్నారు.