చండీగఢ్: బాంబులతో పేల్చివేస్తామంటూ 8 రైల్వే స్టేషన్లకు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్యానాలోని రేవారితో సహా సుమారు 8 రైల్వే స్టేషన్లను బాంబులతో పేల్చి వేయనున్నట్లు కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందింది. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అప్రమత్తమైంది. ఆయా రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. ప్రయాణికులతో పాటు వారి లగేజీని ఆర్పీఎఫ్ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రేవారి రైల్వే స్టేషన్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు ప్రయాణికులు, వారి లగేజ్ తనిఖీలను ముమ్మరం చేసిన ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు.