కులం, మతం, లింగం, వర్గం, భౌగోళిక నివాసాల ఆధారంగా భారత్లో పెరుగుతున్న అసమానతలు డిజిటల్ రంగంలో కూడా ప్రస్ఫుటమవుతున్నాయని ఆక్స్ఫాం ఇండియా పేర్కొన్నది. ‘ఇండియా ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2022-డిజిటల్ డివైడ్’ పేరిట సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది.
డిజిటల్ విభజన దేశంలో అసమానతల పెంపునకు కారణమవుతున్నది. కులం, మతం, లింగం, వర్గం, భౌగోళిక నివాసాల ఆధారంగా భారత్లో పెరుగుతున్న అసమానతలు డిజిటల్ రంగంలో కూడా కనిపిస్తున్నాయి. డిజిటల్ పరికరాలు, ఇంటర్నెట్ సదుపాయం లేనివారు మరింత వెనుకబాటుకు గురవుతున్నారు. ఆన్లైన్లో లభించే విద్య, వైద్యం, ప్రజాసేవలను వారు పొందలేకపోతున్నారు. అసమానతల ఈ విష చక్రాన్ని తక్షణం నిలువరించాలి.
– ఆక్స్ఫాం సీఈవో అమితాబ్ బెహర్
సెల్ఫోన్లు ఉన్న వారు
61% : పురుషులు
31% : మహిళలు
95% : వేతన జీవులు
50% : నిరుద్యోగులు
కంప్యూటర్ ఉన్నవారు
1% : ఎస్టీలు
2% : ఎస్సీలు
8% : జనరల్ క్యాటగిరీ
3% : గ్రామీణులు
8% : పట్టణ ప్రజలు
33% : గత ఏడాది ఇంటర్నెట్ ఉపయోగించిన మహిళలు