కరోనా బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు తన కారును అమ్మేశాడు ముంబైకి చెందిన షానవాజ్ షేక్! ఆయన బంధువు గత ఏడాది కరోనా బారినపడి ఆక్సిజన్ కొరతతో మృతిచెందాడు. దీంతో మనస్తాపానికి గురైన షానవాజ్.. ఇలాంటి పరిస్థితి వేరొకరికి రావొద్దని తన ఫోర్డ్ ఎండ్యూవర్ కారును అమ్మేసి, ఆక్సిజన్ సిలిండర్లను కొన్నాడు. వాటితో గత ఏడాది 6 వేల మందికి ఆక్సిజన్ను అందించాడు. ప్రస్తుతం తనకు రోజుకు 500 కాల్స్ వస్తున్నాయని చెప్పాడు.