న్యూఢిల్లీ, అక్టోబర్ 18: కరోనా మహమ్మారి విలయం నుంచి ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం చేసిన ప్రకటన కలవరపరుస్తున్నది. 80 శాతం ప్రాణముప్పు ఉన్న కొత్త కరోనా వేరియంట్ను తాము ల్యాబ్లో అభివృద్ధి చేసినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది.
వుహాన్ వేరియంట్ను, ఒమిక్రాన్ వేరియంట్ను కలిపి వీరు ఈ కొత్త వేరియంట్ను అభివృద్ధి చేశారు. పరిశోధనల్లో 80 శాతం ఎలుకలు మృత్యువాతపడ్డట్టు వెల్లడించారు. దీనిపై నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిప్పుతో చెలగాటం ఆడటమేనని మండిపడుతున్నారు.