న్యూఢిల్లీ: రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్పై కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ( Mallikharjuna Kharge ) మరోసారి విమర్శలు చేశారు. సస్పెన్షన్కు నిరసనగా 12 మంది విపక్ష ఎంపీలు గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేస్తున్నారన్నారు. రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, వర్షాకాల సమావేశాల్లో సభా నియమాల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ సభ్యులపై శీతాకాల సమావేశాల్లో సస్పెన్షన్ విధించడం కూడా సభా నియమాల ఉల్లంఘనే అవుతుందని వ్యాఖ్యానించారు.
ఆ 12 మంది ఎంపీల సస్పెన్షన్ సభా నిబంధనలకు మాత్రమే విరుద్ధం కాదని, రాజ్యాంగానికి కూడా విరుద్ధమేనని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేసి వారు సభలో తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పించాలని ఖర్గే సూచించారు.