న్యూఢిల్లీ : ధరలు నింగినంటడంతో దొంగల కండ్లు నిమ్మకాయలపై పడ్డాయి. రూ 70,000 విలువైన 12 సంచుల నిమ్మకాయలను దొంగలు చోరీ చేసిన ఉదంతం యూపీలోని ఘజియాబాద్ కూరగాయల మార్కెట్లో వెలుగుచూసింది. విచిత్రంగా నిమ్మకాయలనే ఎత్తుకెళ్లిన దొంగలు మిగిలిన కూరగాయల జోలికి పోలేదు.
భోజ్పూర్కు చెందిన రషీద్ స్ధానిక మార్కెట్లో కూరగాయల షాపు నిర్వహిస్తుండగా అతడి షాప్ నుంచి దొంగలు నిమ్మకాయలతో ఉడాయించారు. నిమ్మకాయలు కనిపించకపోవడంతో రషీద్ విలువైన సరుకు పోయిందని వాపోయాడు.
ఇటీవల ఇలాంటి ఘటనలు అధికం కావడంతో కూరగాయల మార్కెట్లో సెక్యూరిటీ గార్డును కూడా నియమించారు. సెక్యూరిటీ గార్డు కండ్లు కప్పి దొంగలు లూటీకి పాల్పడ్డారు. ఇక షహజన్పూర్లో ఈ ఏడాది ఏప్రిల్లో ఇదే తరహా ఘటన జరిగింది. కూరగాయల వ్యాపారి గోడౌన్ నుంచి దొంగలు 60 కిలోల నిమ్మకాయలు, 40 కిలోల ఉల్లిగడ్డలు, 38 కిలోల వెల్లుల్లిని దొంగిలించారు.