న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని జాంగ్పుర ప్రాంతంలో ఉన్న ఉమ్రావో జ్వలరీ షాపులో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు(Delhi Heist). ఆ జ్వలరీ షాపులో ఉన్న సుమారు 25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చోరీ చేయడానికి ముందు దొంగలు సీసీటీవీ కెమెరాలను డిస్కనెక్ట్ చేశారు. లాకర్లు ఉన్న స్ట్రాంగ్రూమ్కు రంధ్రం చేసి దొంగలు చోరీకి పాల్పడ్డారు.
నాలుగు అంతస్తులు ఉన్న ఆ బిల్డింగ్లోకి పై అంతస్తు నుంచి దొంగలు ప్రవేశించారు. గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న స్ట్రాంగ్రూమ్ను పగలగొట్టారు. స్ట్రాంగ్రూమ్లోకి ప్రవేశించేందుకు గోడకు భారీ రంధ్రాన్ని డ్రిల్ చేశారు. అక్కడ ఉన్న ఆభరణాలతో పాటు షోరూమ్లో డిస్ప్లేలో ఉన్న బంగారన్ని కూడా ఎత్తుకెళ్లారు. ఆదివారం సాయంత్రం షోరూమ్ ఓనర్ షాపును మూసివేశాడు.
సోమవారం ఆ షోరూమ్కు సెలవుదినం. ఇవాళ ఉదయం షాపు తెరవగానే దొంగలుపడినట్లు తేలిపోయింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు. రెండు రోజుల క్రితం హర్యానాలోని అంబాలాలో కూడా దొంగలు పడ్డారు. కోఆపరేటివ్ బ్యాంకు నుంచి జ్వలరీతో పాటు ఇతర విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. గోడకు రంధ్రాన్ని డ్రిల్ చేసి, 32 లాకర్లను ఓపెన్ చేశారు.
జ్వలరీ షాపు చోరీ పెద్ద ఘటన అని, ప్రస్తుతం విచారణ జరుగుతున్నదని, సీసీటీవీ ఫూటేజీని పరిశిలీస్తున్నట్లు డీసీపీ రాజేశ్ తెలిపారు.