న్యూఢిల్లీ: అధికారంలో ఉన్న సభ్యులు సృష్టిస్తున్న ఆందోళనల వల్లే పార్లమెంట్లో సభా కార్యక్రమాలు నడవడం లేదని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి(Manish Tewari) ఆరోపించారు. ట్రెజరీ బెంచ్ల్లో ఉన్న నేతలే సభను డిస్టర్బ్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. గత మూడు రోజుల నుంచి అదానీ అంశంపై పార్లమెంట్ వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ కూడా ఉభయసభలను ఎటువంటి అంశాలపై చర్చించకుండానే వాయిదా వేశారు.
2జీ(2G) కేసుతో పాటు హర్షద్ మెహతా(Harshad Mehta) స్కామ్, కేతన్ పరేఖ్(Khetan Parekh) కేసుల్లోనూ సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తు జరిపించినట్లు మనీశ్ తివారి వెల్లడించారు. ఈ కేసుల్లో ఎంక్వైరీ చేసేందుకు సుప్రీంకు హక్కు ఉన్నా.. పాలసీ, రెగ్యులేటరీ అంవాలన్ని పార్లమెంట్ పరిధిలోకి వస్తాయని ఆయన అన్నారు.అందుకే అదానీ సంక్షోభంపై జేపీపీ వేయాలని డిమాండ్ చేస్తున్నట్లు మనీశ్ తివారి వెల్లడించారు.