న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఇథనాల్ కలిపిన పెట్రోల్(ఈ20) విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.కాగా, ప్రభుత్వ సందేశాన్ని ప్రచారం చేయడంలో దూరదర్శన్ న్యూస్ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నది. మే నెల నుంచి ఈ ప్రభుత్వ ప్రసార సంస్థ ఈ20ని ప్రోత్సహించేలా 50కి పైగా వివరణాత్మక కథనాలు, చర్చలు, క్షేత్రస్థాయి నివేదికలను ప్రసారం చేసింది. అయితే గత నెలలో డీడీ న్యూస్ మరో అడుగు ముందుకేసి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో ఏడుగురు రైతు నాయకుల వీడియోలను సైతం విడుదల చేసింది.