ఉత్తరప్రదేశ్లోని బీజేపీ డబుల్ ఇంజిన్ పాలనలో డొల్లతనం, అవినీతి.. ఈ రోడ్డును చూస్తే అర్థమవుతుంది. కాలితో రుద్దగానే.. రోడ్డు బూడిద, మట్టి మాదిరిగా చెరిగిపోతున్నది.
ఘాజీపూర్ నియోజకవర్గంలో నిర్మాణం చేపట్టిన ఈ రోడ్డుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. కోట్ల రూపాయలతో 4.5 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్డు తీరును చూసి స్థానికులు విస్తుపోతున్నారు. పనులను పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే బేదీరాం అధికారులు, కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.