న్యూఢిల్లీ: కేంద్రం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించించేందుకు స్వయం ప్రతిపత్తి సంస్థ దూరదర్శన్ డీడీ న్యూస్ లోగో రంగు మార్చింది. అధికార బీజేపీ జెండా రంగైన కాషాయాన్ని డీడీ న్యూస్ లోగోకు పులమడంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘ఎంతో చరిత్ర ఉన్న డీడీ న్యూస్ లోగో కాషాయ రంగులోకి మారిపోయింది. ఇక నుంచి ఇది ప్రసార భారతి ఎంతమాత్రం కాదు.. ఇది ప్రచార భారతి’ అని డీడీ మాజీ సీఈవో, టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ విమర్శించారు. ఈ చర్య ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి ఈసీ అమలు చేస్తున్న ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు.