న్యూఢిల్లీ, నవంబర్ 21: జాతీయ అర్హత పరీక్ష(నెట్) సిలబస్ను సవరించాలని యూనివర్సిటీ నిధుల సంఘం(యూజీసీ) నిర్ణయించింది. ఇందుకోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ మంగళవారం తెలిపారు.
కొత్త సిలబస్ను ప్రవేశపెట్టే ముందు అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం తగినంత సమయం ఇస్తామని చెప్పారు. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హత పరీక్షగా యూజీసీ-నెట్ను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఏటా రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు.